యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడి గా నర్సింలు ముదిరాజ్…..

Hyderabad

తెలంగాణ రాష్ట్ర యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడి గా నర్సింలు ముదిరాజ్ నియామకం

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడి గా సీనియర్ జర్నలిస్ట్, మెదక్ జిల్లా, రేగోడ్ మండలo ప్యారారం గ్రామానికి చెందిన తెనుగు నర్సింలు ముదిరాజ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ తెలిపారు. ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తిగా జర్నలిస్టుగా, నికార్సైన వార్తలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రాష్ట్రంలో ముదిరాజుల పై జరుగుతున్న అన్యాయాలు , హాస్టల్లో సీట్ల పంపకాలు, రిజర్వేషన్ల పై పోరాడే వ్యక్తి గా జాతి సేవలో విశిష్ట సేవలు అందించగలరనే నమ్మకంతో ఈ నియామకం జరిగింది అని ఆయన తెలిపారు.
జాతి సేవలో విశిష్ట సేవలు అంధించగలరనే నమ్మకంతో మిమ్మల్ని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను సమీకరిస్తూ , రాజకీయాలకు అతీతంగా నియమనిబంధనలు పాటిస్తూ, జాతి సమగ్రతకు, సర్వతోముకాభివృ ద్దికి అహర్నిశలు కృషి చేయాలని ఆయన సూచించారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంకిత భావం తో పని చేస్తూ, ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *