మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి స్వగ్రామంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ దంపతులు చిన్నారులు, మున్సిపాలిటీ కార్మికులతో కలిసి హోలీ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. చిన్నారులు రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలను హోరెత్తించారు. వారి ఇంటి వెళ్లి చిన్నారులు రంగులు పోస్తూ హోలీ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆనందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూచెడు పై సాధించిన విజయంకు ప్రతీక గా చిన్న, పెద్ద అని తేడా లేకుండా హోలీ వేడుకలను జరుపుకుంటారని తెలిపారు. ఈ రంగుల పండుగ హోలీ అందరికి సరికొత్త ఆనందాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. రంగులు చల్లుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బందిగా మారకుండా చూసుకోవలన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ పండుగను హుందాగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
