మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Hyderabad politics Telangana

పటాన్చెరు

తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్య శాఖ ను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని సాకీ చెరువు, తిమ్మక్క చెరువు, తీగల నాగారం చెరువు, దోషం చెరువులలో ఏడు లక్షల రూపాయల విలువైన మూడున్నర లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 42 సొసైటీల ద్వారా 70 లక్షల రూపాయల విలువైన 35 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మంచి లాభాలు గడించాలని కోరారు.

మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మత్స్య శాఖ జిల్లా అధికారి సతీష్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తులసి దాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇక చదవండి

తల్లిదండ్రులు లేని బాలుడి కోరిక తీర్చిన మధు ముదిరాజ్ సైకిల్

కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *