మనవార్తలు ,పటాన్చెరు/అమీన్పూర్:
కార్తీకమాసం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయా సంఘాలు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు మండలం రామేశ్వరంబండ, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణాల్లో వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామూహిక వన భోజనాల కార్యక్రమం ద్వారా వ్యక్తులు, కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతీ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, బాల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.