పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణంలోని నొవపాన్ పరిశ్రమ సమీపంలో గల ఖాళీ స్థలంలో కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 30 వేల మంది విద్యార్థులు ఒకే సమయాన సామూహిక గీతాలాపన చేసేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డిఎస్పి ప్రభాకర్, సిఐ వినాయక్ రెడ్డి, జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
