క్యాన్సర్‌ పరిశోధన చేపట్టిన మధుసూదనరెడ్డికి డాక్టరేట్ …

Hyderabad politics Telangana

పటాన్ చెరు:

‘ కొత్త క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా ఇమిడాజో – పిరిడిన్ , పిరిమిడిన్ , స్పిరో అండర్ కేన్ ఆధారిత కేంద్రీకృత నమూనాల రూపకల్పన , సంశ్లేషణ , జీవ మూల్యాంకనం’పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జి.మధుసూదనరెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ లోని రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

ఈ పరిశోధనలో నూతన క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను అభివృద్ధి చేయడం , క్యాన్సర్ గుర్తించి క్లుప్త అధ్యయనాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు . కీమోథెరపీ ఔషధాల ఆవశ్యకత ఆధారంగా , అధిక శక్తి , కనీస దుష్ప్రభావాలున్న ఇమిడాజో పిరిడిన్ , సిరిమిడిన్ , డయాజాస్పిరో వంటి మూడు నూతన శ్రేణి ఔషధాలను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు . వీటిని ప్రయోగించి చూడగా , 47 అణువులలో 12 అద్భుతమైన క్యాన్సర్ నిరోధక చర్యను ప్రదర్శించినట్టు తెలియజేశారు .

మధుసూదనరెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

ఇవి చదవండి

గీతంలో బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీసును ప్రాంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *