పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం హనుమాన్ దేవాలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగాయి. శనివారం సాయంత్రం లడ్డూ వేలం నిర్వహించారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో తిగుల్ల విక్రమ్ కుమార్ – శ్రీలక్ష్మి దంపతులు లడ్డూ ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లడ్డూను దక్కించుకున్న వారికి సన్మానించి, లడ్డూ ను అందజేశారు.
