బిజెపి నుండి బిఆరెస్ లోకి చేరికలు

Hyderabad politics Telangana

– గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి యాదవ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బిజెపి చేస్తున్న మత విద్వేషాలు రెచ్చ గొట్టే విధానాలు నచ్చక చాలా మంది సీనియర్ నాయకులు, యువకులు బిఆరెస్ పార్టీ లో చేరుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ బిఆరెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తo చేశారు. ఆదివారం రోజు శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ కు చెందిన బిజెపి నాయకులు వాకిటి శంకర్, టి. చంద్ర ల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో సీనియర్ నాయకులు, యువకులు బిజెపి పార్టీ నీ వీడి బిఆరెస్ లో చేరగా వారికీ రవి యాదవ్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు అనాలోచిత నిర్ణయం తొ ప్రజలు తొందర పడి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేశామని పశ్చాతాప పడుతున్నారని, మళ్ళీ బిఆరెస్ పార్టీ చేసిన అభివృద్ధి నీ చూసి పార్టీ లోకి వస్తున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తo చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కే. ఎన్. రాములు, ప్రభాకర్ గౌడ్, డాక్టర్ రవికుమార్, స్వామి, శ్రీను, వెంకట్ చారి, సురేష్, కొండాకల్ శ్రీను, చింతల శ్రీకాంత్ యాదవ్, పంతం సురేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సాయినందన్ ముదిరాజ్,మల్లేష్ గౌడ్, గడ్డ మహేష్, పవన్, సత్యనారాయణ గౌడ్, బబ్లు, విశాల్, పూర్ణ, మనోజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *