శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
కుటుంబ వ్యవస్థ ను కాపాడుతూ భారతీయ సంస్కృతి ని కాపాడాలని మాజీ ఉప రాష్ట్రపతి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం రోజు గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో గల అన్వయ కన్వీన్షన్ హల్ లో సుజనా చౌదరి, డాక్టర్ కామినేని శ్రీనివాస్ లు వెంకయ్య నాయుడు ను ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ అభినందన సభలో అయన మాట్లాడుతు నేటి రాజకీయo లో చాలా మార్పులు వచ్చాయని, మంచి నాయకులను ఎన్నుకోవాలని, అప్పుడే మన సమాజం బాగుంటుందని సమాజ బాగుకోసం పాటు పడాలని సూచించారు. నేటి పిల్లలు సృజనాత్మకథను కోల్పోయి, ఆర్టిఫిషియల్ గా తయారవుతున్నారని, చిన్నప్పటి నుండే సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించాలని, దేశాన్ని, తల్లితండ్రులను ప్రేమించేలా నేర్పించాలన్నారు. ఎలక్రానికి వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. నిరాడంబరుడు, స్నేహ శీలి, అయిన వెంకయ్య నాయుడు లాంటి గొప్ప వ్యక్తులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి, మురళి మోహన్, కెవిపి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు