హైదరాబాద్
బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్గా సాగింది. హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జూవెలరీ షోరూంలో దసరా పండుగ సందర్భంగా సరికొత్త జువెలరీ కలెక్షన్స్ ను మోడల్స్తో కలిసిసంస్థ డైరెక్టర్ మురళీ కృష్ణ ఆవిష్కరించారు . పెళ్ళిళ్ళు పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా జువెలరీ కలెక్షన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి ద్రిషిక చందర్ అన్నారు . మోడల్స్ బ్రైడల్,వెడ్డింగ్,ఫెస్టివ్ కలెక్షన్స్ ప్రదర్శిస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.
తెలుగు ప్రజల ముఖ్య పండుగ దసరా. ఈ దసరా నవరాత్రి పండుగ కు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు , బంగారు అభరణాలు కొనుగోలు చేయడం అనవాయితీ . హైదరాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో అత్యంత అద్భుతమైన దసరా, వెడ్డింగ్ కలెక్షన్స్ మోడల్స్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మానేపల్లి జువెలర్స్ డైరెక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ దేశం యొక్క విభిన్న సంస్కృతి ,పండుగల ఆధారంగా డిజైన్లను మేము మానేపల్లి జ్యువెలర్స్లో నిర్వహిస్తున్నాము . పెళ్లిళ్లు ,పండుగ సమయంలో వివిధ ప్రాంతాలు, దేశవిదేశాలలో ప్రజాదరణ పొందిద్దన్నారు . మా కస్టమర్ల ప్రాధాన్యతలకు సరిపోయే సరికొత్త డిజైన్లు అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు . ఈ కొత్త కలెక్షన్స్ అందరికి ఎంతగానో నచ్చుతాయని తెలిపారు .