అందరికంటే ఆరోగ్యవంతుడే నిజమైన ధనవంతుడు_ చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్  

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

చిట్కుల్ గ్రామంలో సాయి దీప మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు .ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు .ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు ఆయన చెప్పారు.

యోగా, వ్యాయామం వంటివి ప్రతిరోజూ దైనొందిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య సేవలు ప్రజలకు అందాలని అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే మందులు ఉండేవి కాదని ప్రస్తుతం అన్ని మందులు ప్రభుత్వాసుపత్రిలో ఇస్తున్నారని అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేశ్, కృష్ణ, బుజంగం, శ్రీను, మురళీ, వెంకటేశ్, రాజ్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *