ఘనంగా ముదిరాజ్ ఆవిర్భావ వేడుకలు

Districts Telangana

రెగోడ్, మనవార్తలు :

హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఇందులోభాగంగా మెదక్ జిల్లా రేగోడ్ మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో ఘనంగాని ర్వహించారు. కీర్తిశేషులు కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు, ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ పి చైర్మన్ కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు నివ్వవడo తో ఆదివారం రోజూ రేగోడ్ మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మంద విట్ఠల్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసి వారికి నివాళ్ళు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోయిని సాయిలు,ప్రధాన కార్యదర్శి బండి సాయిలు, సహాయ కార్యదర్శి దొండ్ల నారాయణ, కోశాధికారి గొండ్ల జనార్దన్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *