గీతం స్కాలర్ జపమాల రాణికి పీహెచ్ డీ

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ , హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని బి.జపమాల రాణిని డాక్టరేట్ వరించింది. ‘సాధారణీకరించిన కుంభాకారం ద్వారా విరామం-విలువ ప్రోగ్రామింగ్ సమస్యల అధ్యయనం’పై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ కుమ్మరి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. రేఖ సిద్ధాంత వ్యాసం, సర్వోత్తమీకరణం సమస్య అనిశ్చితి డేటాను పరిష్కరించడానికి సాంకేతికతలను పరిచయం చేసిందని తెలిపారు. లాంగ్రజ్ ఫంక్షన్ సాడిల్ పాయింట్ పరిస్థితులు వివిధ రకాల విరామం-విలువ ప్రోగ్రామింగ్ సమస్యలతో పాటు పరిష్కారాలు, వాటి నిర్మాణ లక్షణాలను కూడా పరిశీలించినట్టు డాక్టర్ కృష్ణ వివరించారు. జపమాల రాణి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరక్టర్ డీవీపీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపరులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *