శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :
ప్రముఖ సంఘ సేవకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ ఆరవ వర్ధంతి సందర్భంగా బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనుష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పెట్ గ్రామంలో ఉచిత వైద్య, రక్తదాన మరియు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా దాదాపు 200 మందికి ఉచిత వైద్యంతో వివిధ రకాల టెస్టులను మరియు మందులను ఉచితంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ వారికి దాదాపు 80 మంది రక్తదానం చేసి హాస్పిటల్స్ సిబ్బందికి అందజేశారు.ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బోయిని శ్రీకాంత్ యాదవ్, జనరల్ ఫిజీషియన్ శ్రీకర్, బోయిని మల్లేష్ యాదవ్, రాజేష్ యాదవ్, రామస్వామి యాదవ్. రాచమల్ల నాగేశ్వరరావు గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మాణిక్ రావు, మహమ్మద్ సలీం,రవి ముదిరాజ్, అశోక్ నాయి, నవీన్, సాయి గౌడ్, ఆకుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.