అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన

politics Telangana

_అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట గ్రామాలలో నిర్మిస్తున్న ఫంక్షన్ హాళ్లు, దాయర నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు.అనంతరం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనే అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సర్పంచులు కృష్ణ, భాస్కర్ గౌడ్, వైసీపీ సునీత సత్యనారాయణ, నాయకులు రాజు, పంచాయతీరాజ్ శాఖ డీఈ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *