మనవార్తలు ,పటాన్ చెరు:
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని చిట్కులు సర్పంచు నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రుద్రారం , గుమ్మడిదల ,బొంతపల్లి అంబేద్కర్ కాలనీలో పోచమ్మ బోనాల మహోత్సవంలో బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చిట్కులు సర్పంచు నీలం మధు ముదిరాజ్ ను ఉత్సవ నిర్వహకులు ఘనంగా సత్కరించారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ పండగలకు, ఉత్సవాలకు, ప్రాధాన్యత కల్పించింది తెరాస ప్రభుత్వమేనని అధికారంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు . తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని వేడుకున్నా అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మన్నే రాజు, వార్డు సభ్యులు పెంటేష్,ప్రభు,ప్రశాంత్, మల్లేష్,కుమ్మరి వెంకటేశ్,E శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి,గారెల మల్లేష్,శంకర్,నర్సింలు,గోపాల్,వెంకటేశ్,అశోక్,కనకరాజు,గణేష్,సతీష్,మహేష్,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు