అంతరిస్తున్న కళలను నిలిపిన ‘ సంస్కృతి…

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

‘ అంతరించిపోతున్న భారతీయ కళల వేడుకలను ‘ సంస్కృతి ‘ పేరిట గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) విద్యార్థులు సగర్వంగా నిర్వహించారు . తమ విద్యా సంస్థలోని విద్యార్థులు , అధ్యాపకులలో నిబిడీకృతంగా ఉన్న కళాకారులను కళ , కవిత్వం వంటి పోటీల నిర్వహణ ద్వారా వెలితీశారు . అంతేగాక , భారతీయ కళల స్థితిపై అభిప్రాయాలను తెలియజేయడానికి యువతకు వక్తృత్వం పోటీలను నిర్వహించారు . ‘ పొట్టి సినిమా ‘ ( షార్ట్ ఫిల్మ్ ) పేరిట నిర్వహించిన పోటీకి ఔత్సాహికులను ఆహ్వానించగా , దాదాపు 43 మంది భారీ భాగస్వామ్యంతో విశేష ఆదరణ లభించింది . కళల పట్ల యువతరానికి ఉన్న ఉత్సుకత , అభిరుచిలకు తార్కాణంగా నిలిచింది . హిట్వర్స్ సృష్టికర్త డాక్టర్ శెల్లేష్ కొలను , ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీవిద్యా మహర్షి , పాత్రికేయురాలు ప్రేమమాలిని , గాయని లాలసలను సంస్కృతి వేదికపై సత్కరించారు . మొత్తంగా ఈ వేడుక శాస్త్రీయ ప్రదర్శనలు , అనుకరించలేని అద్భుతకమైన కళలకు వేదికగా నిలిచింది . మనదేశంలోని చేనేత కళాకారులకు మద్దతునిస్తూ విద్యార్థులు చేనేత దుస్తులు ధరించి ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *