గీతంలో ఎన్.సీ.సీ.పై అవగాహన

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సీ.సీ) క్యాడెట్లకు సోమవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్.సీ.సీ.లోని పరిధి, శిక్షణ, అవకాశాల గురించి ఈ కార్యక్రమంలో పరిచయం చేశారు.ఈ సమావేశంలో, వార్షిక శిక్షణా శిబిరం (ఏటీసీ), గణతంత్ర దినోత్సవ శిబిరం (ఆర్డీసీ) తల్ సైనిక్ శిబిరం (టీఎస్సీ) ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఈబీఎస్బీ) శిబిరంతో సహా వివిధ శిబిరాల ప్రాముఖ్యతను ఎన్.సీ.సీ. అధికారి, సీనియర్ క్యాడెట్లు వివరించారు. ప్రజెంటేషన్లు, వీడియోల ద్వారా, క్యాడెట్లకు మ్యాప్ రీడింగ్, దిక్సూచి వినియోగం, దూరాన్ని అంచనా వేయడం, క్షేత్ర సంకేతాలు, నిర్ధారిత సమయంలో టెంట్లు వేయడం, డ్రిల్, శారీరక శిక్షణ, ఆయుధ నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి, జాతీయ స్థాయి పోటీలు వంటి కార్యకలాపాలను పరిచయం చేశారు. క్రమశిక్షణ, నాయకత్వం, జట్టు స్ఫూర్తి, జాతీయ భావనను పెంపొందించడంలో ఈ శిబిరాల పాత్రను ఈ సందర్భంగా ప్రముఖంగా తెలియజేశారు.ఎన్.సీ.సీ. శిక్షణ కేవలం సాధారణ డ్రిల్స్ కు మాత్రమే పరిమితం కాదని, బాధ్యతాయుతమైన, ఆత్మవిశ్వాసం గల పౌరులుగా తీర్చిదిద్దే పరివర్తనాత్మక అనుభవాలను అందిస్తుందని ఈ కార్యక్రమం ప్రస్ఫుటీకరించింది.అసోసియేట్ ఎన్.సీ.సీ. అధికారి లెఫ్టినెంట్ ఎస్.అజయ్ కుమార్ సీనియర్ క్యాడెట్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *