భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 96వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

Districts politics Telangana

మన వార్తలు ,పటాన్‌చెరు:

పటాన్చెరు శాంతి నగర్ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 96వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ వారు చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు.

అనంతరం మాట్లాడుతూ అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుధ్ధ హృదయంతో జీవించాలనీ తమ ఉప న్యాసాల్లో బోధిస్తుంటారని ప్రార్థించే పెదవులకన్నా సేవించే చేతులు మిన్న అని నిత్యం సత్యసాయిబాబా భగవాన్ అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు సహాయం చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎల్లప్పుడూ చెబుతారని అన్నారు సత్య సాయి సేవా సంస్థల అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా నేటికీ జరుగుతుండటం విశేషం.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ కాడి హారిక విజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *