మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని కొండాపూర్ లో గల రాజరాజేశ్వరీ కాలనీ లో సర్వే నెంబర్ 78 నుంచి 93 లో గల ప్లాట్ నెంబర్ 102 లో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ భవనం నిర్మాణం జరుపుతున్నారని రాజరాజేశ్వరీ కాలనీ ప్రెసిడెంట్ విజయ కృష్ణ స్థానిక జోనల్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు .అనంతరం అయన మాట్లాడుతూ కాలనీ లో ఎలాంటి చిన్న నిర్మాణాలు జరిపిన రేకులు షెడ్లు తో సహా అనుమతులు లేకుండా జరుపుతే సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్న తరుణం లో మరి ఈ భారీ నిర్మాణం పై అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదో మాకు అర్ధం కావడం లేదు అని విజయ్ కృష్ణ వాపోయారు తక్షణమే కమీషనర్ స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలిచ్చి అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కోరారు.
