మనవార్తలు ,పటాన్ చెరు :
తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కృషి ఛేస్తుందని తెలిపారు.పటాన్ చేరు మండలం లోని సోమవారం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు గ్రామం లోని రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులకు నిత్య అవసరాల పంపిణి చేశారు .అనంతరం మాట్లాడుతూ మైనారిటీలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలు, ఏర్పాటు చేసి వారి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. హిందు,ముస్లిం భాయి భాయి అంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అన్నారు. .రంజాన్ పండుగ ఘనంగా జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారాని అని తెలిపారు ముస్లిం సోదరీ, సోదరీమణులు రంజాన్ పండుగ ను ఆనందోత్సాహలతో జరుపుకోవాలని , వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.
ఈ కార్య క్రమంలో వార్డు సభ్యులు , క్రిష్ణ, వెంకటేష్, బుజంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు, ముస్లిమ్ సోదరులు, అజ్జూ, కదిర్, జబ్బర్, అంజద్, ముజాయిట్, సికిందర్,ఎన్ఎమ్ యువసేన పాల్గోన్నారు.