మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసిందని _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

చిట్కుల్ గ్రామం లో రంజాన్ మాసం పురస్కరించుకొని మసీదులో షేక్ అష్రఫ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ పవిత్ర మాసం లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రోజా నిర్వహించి అనంతరం ఇస్తారు విందులో పాల్గొనడం మంచి విశేషమని అన్నారు .మైనార్టీలకు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని  హిందూ ముస్లిం భాయి భాయి అంటూ అందరూ కలిసి ఉండటం అనాదిగా వస్తుందని తెలిపారు ఒకరి పండుగలో ఒకరి పండుగలు ఒకరు గౌరవించుకుని సుఖశాంతులతో ఉండాలని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్  కోరారు .ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, బుజాంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్ విలేజ్ ప్రడెంట్ ప్రశాంత్ ముస్లిమ్ సోదరులు, అజ్జూ, కదిర్, జబ్బర్, అంజద్, ముజాయిట్, సికిందర్, ఎన్ఎమ్ఎమ్ యువసేన పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *