ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మాసం  చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు చాకలి వెంకటేష్ గారు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.హిందూ ముస్లిం భాయి భాయి అంటూ ఎంతో కాలంగా కలిసి జీవిస్తున్నామన్నారు. ఒకరి పండుగలు మరొకరు గౌరవించుకుంటూ అందరం కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉంటుంన్నామన్నారు ఎంతో పవిత్రంగా భావించే ఈ నెలలో ముస్లిం సోదరులు రోజంతా రోజా ఉండి సాయంత్రం విందులో పాల్గొనడం ఎప్పటి నుండో వస్తున్న ఆచారం అని తెలిపారు ఇలా చేస్తే అల్లా సంతోషాలతో చూస్తాడని వారి విశ్వాసంగా నమ్ముతారని తెలిపారు. రాబోవు రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈ మాసం అంతా జరుపుకుంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అజ్జు, జబర్, ఆశురఫ్, సికిందర్,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,వర్డుర్ సభ్యులు దుర్గయ్య, మన్నేవెంకటేష్, వెంకటేష్, బుజంగం, శ్రీను,మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, ఆంజనేయులు మాజీ MPP శ్రీశైలం, తదితారులు పాల్గోన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *