వందశాతం వ్యాక్షినేషన్ పూర్తి చేసుకున్న మక్తా గ్రామానికి సర్టిఫికెట్ అందజేత

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి , మియాపూర్ :

కరోనా నివారణకు వ్యాక్సిన్ టీకాలు 100 శాతం పూర్తి అయిన సందర్భంగా మియాపూర్ డివిజన్ లోని హెచ్.ఎం.టి మక్తా గ్రామానికి జిహెచ్ఎంసి సిబ్బంది గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ కు మంగళవారం రోజు సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కరోనా నివారణ టీకాలు మక్తా గ్రామ ప్రజలు అందరూ 100 శాతం వ్యాక్సిన్ వేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అని ప్రజలకు కోరారు. ప్రజలందరూ కూడా కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకోవాలని ఇంటిoటికెళ్ళి ప్రతి ఒక్కరు వ్యాక్షినేషన్ వేసుకోవాలనే అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న కాలనీల సభ్యులు కూడా వ్యాక్షినేషన్ తీసుకోవాలని కోరారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *