బండి సంజ‌య్ కాన్వాయిపై దాడిని ఖండించిన _ బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

Districts politics Telangana

మనవార్తలు , పటాన్చెరు

రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నద్రుశ్య వరి కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిమీద టిఆర్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తూ మంగళవారం ఇస్నాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు అనంతరం  శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ తన స్థాయిని మరిచి నీచ రాజకీయాలకు పాల్పడ్తున్నారని ఆరోపించారు.రాజకియంగ బీజేపీని ఎదుర్కోవడం చేత గాక ఇలాంటి చర్యలకు దిగజారుతున్నాడని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కుడా ఇలానే రెచ్చగొట్టి 1200 మంది ఆత్మబలిదానాలకు కారకులైన కేసీఆర్ కుటుంబ పాలన చేస్తు ఇప్పుడు టీఆర్ఎస్ గుండాలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడులకు బండి సంజయ్ గారు గాని బీజేపీ నాయకులు కాని భయపడరని, తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ ‌సమస్య‌ ఉంటే అక్కడ బీజేపీ ప్రజలకు ‌అండగ నిలబడుతుందని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర బుద్దులు మానుకోని ప్రజాస్వామ్య పద్ధతిలో చేతనైతే రాజకీయంగా ఎదుర్కొవలని అలాగే రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని హితవు పలికారు. తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్ లో గోల్కొండ కోట మీద బిజెపి జెండా ఎగరడం కాయమని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పటాన్ చెరువు మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా సభ్యులు మధుకర్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *