సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ కి వాటర్ కూలర్ ను అందజేసిన ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజి రెడ్డి
రామచంద్రాపురం పట్టణం సాయి నగర్ కాలనీ వెల్ఫర్ సొసైటీకి ఎస్ అర్ ట్రస్ట్ ఛైర్మన్ అంజిరెడ్డి గారి సహకారం తో కాలనీ గౌరవ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి వాటర్ కూలర్ ని అందజేశారు.అనంతరం దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ సొసైటీ సభ్యులంతా కలిసి కట్టుగా పనిచేసి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి చేస్తున్న సేవలు మరువలేన్నారు. సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ఈ కార్యక్రమలో కాలనీ అధ్యక్షులు పెంటారెడ్డి, నారయణ, జగన్ గౌడ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
