గీతం వ్యవస్థాపకుడికి ఘననివాళి…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు :

గీతం సొసెట్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి 84 వ జయంతి సందర్భంగా ఆదివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు . శివాజీ ఆడిటోరియం ఫోయర్ హాలులో ఏర్పాటు చేసిన డాక్టర్ మూర్తి చిత్రపటానికి పూలు చల్లి గీతం డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , విభాగాధిపతులు , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది అంజలి ఘటించారు . గీతం పాలక మండలి సభ్యుడు శ్రీ కడియాల వెంకట రత్నం ( గాంధీ ) , గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *