అక్రమ నిర్మాణం ఫై చర్యలు తీసుకోవాలనీ ప్రజావాణి లో పిర్యాదు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

ఆదర్శనగర్, శేరిలింగంపల్లి, ప్లాట్ నెం. 53, స. నెం. 58/1 లో మిరియాల ప్రీతం నిర్మించిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని‘ప్రజావాణి’లో జోనల్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి.స్టెటస్కోలో నిర్మాణం చేస్తున్న సందర్భంలో కంటెంప్ట్ కూడా ఫైల్ చేసినా బిల్డర్ బాజాప్తా నిర్మాణం చేశాడని కసిరెడ్డి భాస్కరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.సెల్లార్ తో పాటు అనేక అక్రమ ఫ్లోర్లు నిర్మించడంతో పాటు 53 గజాలు అదనంగా కబ్జా చేశాడనే విషయం టౌన్ ప్లానింగ్ దర్యాప్తులో తేలిందని వెంటనే చర్యలు తీసుకోవాలని ‘జనం కోసం’ డిమాండ్ చేసిందన్నారు.హోటల్ పేరు పెట్టి హోటల్ నడుపడం లేదని, కోర్టు కేసు దృష్ట్యా అలా నడుపుతున్నట్టు ఫేక్ హోటల్ సృష్టించాడని ‘జనం కోసం’ జోనల్ కమీషనర్ కు ఇచ్చిన ఫిర్యాదు పేర్కొన్నారు.వెంటనే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ‘జనం కోసం’ జోనల్ కమీషనర్ ను డిమాండ్ చేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *