_రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో గల ప్రసిద్ధ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రీ పాండు, ఎంపీటీసీ రాజు, పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

