కొత్త ఔషధాలకు అధిక ధర, సుదీర్ఘ ప్రక్రియే సవాళ్లు…

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

కొత్త ఔషధాలను మార్కెట్లలోకి తీసుకురావడానికి అధిక ధర, సుదీర్ఘ ప్రక్రియే పెద్ద సవాళ్లని ఇన్నారురా సెంట్రిఫిక్ ప్రెనేట్ లిమిటెడ్ సీఈవో వ్యవస్థాపకుడు డాక్టర్ నందన్ కుమార్ దుద్దుకూరి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘చిన్న మాలిక్యూల్ ఔషధ ఆవిష్కరణ రంగంలోని సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు.యాంటీబయాటిక్స్క బ్యాక్టీరియాలో పెరుగుతున్న నిరోధకత సవాలును అధిగమించడంతో పాటు ప్రస్తుతం చికిత్స చేయలేని వ్యాధులకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయవలసిన తక్షణ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రోడాక్ట్స్ ప్రాముఖ్యతను చెబుతూ, ఇది వర్ధమాన ఫార్మసిస్థకు గణనీయమైన నిధుల పొందే వెసులుబాటును కల్పిస్తోందన్నారు.విద్యార్థులు తదుపరి అధ్యయనాలను కొనసాగించాలని, ప్రోడాక్ట్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నివారణకు మార్గం సుగమం అవుతుందని డాక్టర్ దుద్దుకూరి నొక్కి చెప్పారు.తొలుత, ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.ఎస్.కుమార్ అతిథిని స్వాగతించి, సత్కరించారు.

మోహినియాట్టం….

పరిశోధన విద్యార్థిని (రీసెర్చ్ స్కాలర్), దూరదర్శన్లో ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్ట్ శ్రీజ శ్రీకాంత్ శుక్రవారం గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లో ‘మోహినియాట్టం’ను ప్రదర్శించి, ఆహూతుల ప్రశంసలందుకున్నారు. ఆనందు మురళి (గాత్రం), టి. అక్షయ (నట్టువాంగం), శ్రీకాంత్ విశ్వనాథన్ (మృదంగం) ఆమెకు సహకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *