పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను తీసుకోవాలని బైక్ ర్యాలీ

politics Telangana

మన వార్తలు, శేరిలింగంపల్లి :

ఆజాదికా అమృత మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని రాంచంధ్రాపురం పోస్టల్ ఇన్స్ పెక్టర్ సావిత్రి శుక్రవారం ఆధ్వర్యంలో భేల్ క్యాంపస్ లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి పోస్ట్ ఆఫీస్ లో జాతీతమ జెండాలను విక్రహిస్తున్నామని తెలిపారు. ఒక్కొ జెండా 25 రూపాయలకు విక్రయిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జెండా వందనం 15 న ప్రతి ఇంటిలోనూ, ఆఫీసుల్లోను తను జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ స్వాతంత్య్ర దినోత్సవం.జరుపుకోవాలని కోరారు. పోస్ట్ ఆఫీస్ వరకు రాలేని వారు www. epostoffice. ga.in లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే మా సిబ్బంది వచ్చి అందిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించగలరని కోరారు. ఈ కార్యక్రమం లో సంగారెడ్డి డివిజన్ సూపరిండెట్ మురళి కుమార్, పోస్ట్ మాస్టర్ ఆంజనేయులు, పోస్ట్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *