_యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి
– ఫ్యాక్టరీస్ ఆప్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు
– సద్వినియోగం చేసుకున్న ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు పేర్కొన్నారు.జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం బీరంగూడ లోని షిరిడి సాయి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ మెగా హెల్త్ చెకప్ క్యాంప్ లో ఎంఎస్ఎన్ పరిశ్రమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా క్యాంపుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గోపాలరావు మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే తమ దినచర్య అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. బయట తినే ఆహారం హైజెనిక్ గా ఉండదని, ఇంట్లో వండిన మంచి ఆహారాన్ని భుజించే అలవాటు పెద్దలు అలవాటు చేసుకోవడంతో పాటు తమ పిల్లలకు నేర్పాలన్నారు. ఎపిఐ తయారీ హెడ్ ఎన్ఎన్ వి సుబ్బారావు మాట్లాడుతూ ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ హెచ్ఆర్ హెడ్ పద్మనాభన్, కెఎల్ఎన్ మూర్తి, డాక్టర్ వంశీ కృష్ణన్, డాక్టర్లు, ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.