విద్యార్థులకు మెమోంటోలు అందజేత

Hyderabad politics Telangana

 శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :

శేరిలింగంపల్లి మండల మరిధిలో గల దీప్తి శ్రీనగర్ లోని క్రిసెందో ఆర్ట్స్ స్కూల్ అన్యువల్ డే సందర్భంగా స్కూల్ ఫౌండర్ మెర్సీ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా రామొస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ అండ్ బి అర్ టి యూ రాష్ట్ర నాయకులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి హాజరై పిల్లలకు సర్టిఫికెట్స్, మెమెంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ పిల్లలకు డాన్స్, మ్యూజిక్, గిటార్, కీబోర్డ్, లాంటి అనేక యాక్టివిటీస్ నేర్పిస్తూ పిల్లల్ని చైతన్య పదంలో నిలుపుతున్నారని, రోజురోజుకు పిల్లలకు నేర్పించే విధానాన్ని చూసి పిల్లల పేరెంట్స్ కూడా ఉత్సాహంతో పిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ నేర్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకెన్నో కొనసాగించాలని మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ శర్మ,, సింగర్ సావిత్రి, సుహాసిని, గాయత్రి, ఇనిస్ట్యూట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *