పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ యువ క్రీడాకారిణి షన్వితారెడ్డి ఐటీఎప్ జూనియర్ సర్క్యూట్ అండర్ 18 డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.ఉగాండ దేశంలోని కంపాలాలో జరిగిన ఐటీఎప్ అండర్ 18 విభాగంలో వివిధ దేశాల క్రీడాకారులతో పోటీ పడి టెన్నిస్ డబుల్స్ లో షన్వితారెడ్డి చక్కటి ప్రతిభ కనబర్చారు. వివిధ దేశాల క్రీడాకారుల తో పోటీ పడి టెన్నిస్ డబుల్స్ లో షన్వితారెడ్డి విన్నర్ గా నిలిచింది. టెన్నిస్ డబుల్స్ లో భారతదేశం తరపున నూకల షన్విత రెడ్డి జర్మనీకి చెందిన మిచెల్లి కోయిమిచ్, రష్యాకు చెందిన లీలియా అకోమీటోవా , ఇండియా తరపున సీహా మహాజాన్ తో పోటీ పడి 3-6,6-4,10-4 స్కోర్ తో ఫైనల్ లో టెన్నిస్ డబుల్స్ లో విన్నర్ గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ టెన్నిస్ టూర్ జూనియర్ సర్క్యూట్ అండర్ 18 సింగిల్స్ లో రన్నరప్ గా నిలిచింది.
బాలికల సింగిల్స్ ఫైనల్స్ లో శాన్విత 4-6, 3-6 తేడాతో రష్యాకు చెందిన టాప్ సీడ్ లేలా అక్ మోటావా చేతిలో ఓడిపోయింది. చివరి వరకు అద్బుత ప్రతిభ కనబర్చిన శాన్విత ఫైనల్స్ లో గట్టిగా పోరాడినా లేలాపై పైచేయి సాధించలేకపోయింది. పటాన్ చెరుకు చెందిన షన్వితారెడ్డి ప్రస్తుతం గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ లో పదకొండవ తరగతి చదువుతోంది. పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి కుమార్తె షన్వితారెడ్డి టెన్నిస్ క్రీడలో రాణించడంపై స్థానికులు హర్షం వక్తంచేస్తున్నారు . షన్వితకు విజయ్ టెన్నిస్ అకాడమి కోచ్ విజయ్ కుమార్ ,ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలు అభినందనలు తెలిపారు . ఐటీఎప్ వరల్డ్ టెన్నిస్ టూర్ అండర్ 18 సింగల్స్ లో 1823 ర్యాంకింగ్ దక్కించుకున్నారు .