_డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం వినతిపత్రం అందించారు.మంగళవారం హైదరాబాదులోని బల్దియ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డిలతో కలిసి కమిషనర్ లోకేష్ కుమార్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మూడు డివిజన్ల పరిధిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తుందని ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు అనుగుణంగా సత్వరమే నిధులు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.