అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక..

Hyderabad

అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక…
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు:

90 లక్షల రూపాయల జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికలో పనులు పూర్తయ్యాయని, అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్మశాన వాటికను ఆయన పరిశీలించారు. స్మశాన వాటిక ప్రాంగణంలో మౌలిక వసతులు సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మశాన వాటిక ను నిర్మించినట్లు తెలిపారు.

నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా గ్యాస్, డీజిల్ ఆధారిత స్మశాన వాటికను పటాన్ చెరు లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు సైతం అందుబాటులో ఉండేలా రుసుములు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *