పేద ముస్లీం సోదరులకు రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఏకే ఫౌండేషన్

politics Telangana

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

హిందూ ముస్లీంల మత సామరస్యానికి పండుగలు ఎంతగానో దోహదపడతాయని ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పెద్ద మసీదు వద్ద వెయ్యి మంది పేద ముస్లీం కుటుంబాలకు పది లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్​పండుగను ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలన్నారు . నిరుపేదల ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల సన్నబియ్యం, కేజీ కందిపపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ సెమియా, కేజీ చక్కెర, లీటరు వంటనూనె ఇతర నిత్యావసర సరుకులను అందించారు.

రంజాన్​ పండగను అందరు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ,ఆనందోత్సహాలతో జరుపుకోవాలన్నారు. నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఏకే ఫౌండేషన్ ఏర్పాటు చేశామని సంస్థ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకొని తోఫాలను అందజేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *