ఘనంగా బసవేశ్వరుడి జయంతి…
పటాన్ చెరు:
విశ్వ గురువు శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 888 వ జయంతి వేడుకలు పటాన్ చెరులో ఘనంగా జరిగాయి.
బసవేశ్వర సేవాసమితి, పటాన్ చెరు వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పొగాకు బస్వేశ్వర్ మాట్లాడుతూ…12వ శతాబ్దంలోనే కుల మత వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడు అని కొనియాడారు. నేటి తరానికి ఆయన బోధనలు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు ఈశ్వరప్ప, విశ్వనాథ, రేవప్ప, చంద్రశేఖర్, శ్రీశైలం, శ్రీను, రాజ్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
