శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఅరెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామయ్య నగర్ కాలని అధ్యక్షులు తెల్లాపురం శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఆయన ఫామ్ హౌస్ లో జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, అధికార భాషా సంఘం నాయకులు మిరియాల రాఘవ రావు, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ముదిరాజ్ సంఘం కన్వీనర్ బండారి ఆశోక్ ముదిరాజ్, మేడ్చెల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, కాంటెస్టెడ్ కార్పోరేటర్ మోహన్ ముదిరాజ్ ముదిరాజ్, హాప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, ముదిరాజ్ సంఘం నాయకులు నర్సింలు ముదిరాజ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుకోవాలని కోరారు.