శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2023 క్యాలెండర్ ను గురువారం రోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి. ఆష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ ది ప్రత్యేకమైన పాత్ర ఉందన్నారు. ఏ పార్టీకి కోమ్ము కాయకుండా, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారుల, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తుందని, అందుకు పాతికేయులు నిష్పక్షపాతoగా పని చేయాలన్నారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ పత్రిక విలేకరి నర్సింలు ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు శేకర్, ప్రభాకర్, చిన్న పాల్గొన్నారు.