మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
సర్వం కోల్పోయి కూడు,గూడు, గుడ్డ లేక నిస్సహస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆర్ .కే .వై. టీం ముందుకు వచ్చిoదని ఆర్ కె వై టీమ్ సభ్యులు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ ఎం.ఎం .టి .ఎస్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు చలికాలం దృష్టిలో పెట్టుకొని వారికి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ చేతులు మీదుగా దుప్పట్లు పంపిణీ చేయించడం జరిగిందని, ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు చేయనున్నట్లు వారు తెలిపారు. సేవాకార్యక్రమాలు చేపడుతున్న టీమ్ సభ్యులను రవికుమార్ యాదవ్ అభినందించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఇలాంటి నిరు పేదలు ఎంతో మంది నివసిస్తున్నారని వారందరికీ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించినట్లయితే మీరంతా ఇలా రోడ్లపై నివసించే పరిస్థితి ఉండదని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్.గణేష్ ముదిరాజ్.సోమయ్య.అకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాము, .మధు,.సంతోష్, క్రాంతి, .చంద్ర మసి రెడ్డి. పాపయ్య, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు .