మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

Hyderabad Telangana

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రెగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య తమ్ముని కొడుకు తలారి ప్రేమ్ కుమార్ ఇటీవల రామచంద్రాపురం లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గ్రామానికి వచ్చి వారి కుటుంబనికి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, తూర్పు రామ్ రెడ్డి, మండల యూత్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ ముదిరాజ్, వార్డ్ మెంబర్ నర్సింగ్ రావు, విద్యా కమిటీ చైర్మన్ భూమయ్య, మాజీ వార్డ్ మెంబర్ కుమార్, రామకృష్ణారెడ్డి, కిష్టారెడ్డి, గొల్ల గోపాల్, శ్రీనివాస్, సంతోష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *