పశ్చిమ బెంగాల్లో దాడులను ఖండిస్తున్నాం -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపైదాడులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నాయుకుల తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు .శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులుశ్రీధర్ రావు , బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ కోవిద్ నిబంధనలు పాటిస్తూ తమ నిరసనను తెలిపారు .
పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ మూడు స్థానాల నుంచి 77 స్థానాలకుపార్టీ బలపడిందని..దీన్ని ఓర్వలేక టీఎంసీ పార్టీ గుండాలు, వలస వచ్చిన రోహింగ్యాల మద్దతుతో వృద్దులు ,బీజేపీ కార్యకర్తలపై దాడులు, మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ పార్టీ పిలుపుమేరకునిరసన తెలియజేస్తున్నామన్నారు.
ఏది ఏమైనప్పటికి కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలన్నారు .ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వర ప్రసాద్ ,
కోటేశ్వరరావు,రవి గౌడ్, శివ ,నాగరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు .