నిరుపేద యువతి వివాహానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం

politics Telangana

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి :

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందువుంటుదని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సయ్యద్ గౌస్ అహమ్మద్ రోజు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా కుమారై సానియాకు కొద్ది రోజుల క్రిందట వివాహం నిశ్చయం కాగా చేతులు డబ్బులు లేకపోవడంతో సయ్యద్ గౌస్ అహ్మద్ ఆర్థిక సహాయం కోసం ఏకే ఫౌండేషన్ సంప్రదించారు ,ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ గౌస్ అహమ్మద్ తో మాట్లాడి వివాహ ఖర్చుల నిమిత్తం వారి పరిస్థితులను అడిగి తెలుసుకొని షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు పది వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *