నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్

politics Telangana

_లక్ష లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన శేకర్ గత కొద్దిరోజుల క్రితం రెండు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకుల ద్వారా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన లక్ష రూపాయల ఎల్ఓసిని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కంజర్ల ఎంపిటిసి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ హరిశంకర్ గౌడ్, చిన్న కంజర్ల సర్పంచ్ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *