ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి…ఫార్మశీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి , ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు . గీతం ఫార్మశీ విద్యార్థుల సంఘాన్ని ( జీపీఎస్ఏ ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఆరోగ్య పరిరక్షణ , పరిశుభ్రత , ఔషధ వినియోగం , వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి విషయాలను ఫార్మశీ విద్యార్థులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు . గీతం ప్రాంగణం చుట్టుపక్కలున్న పాఠశాలలు , గ్రామాలకు వెళ్లి , అక్కడి విద్యార్థుల , గ్రామీణుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలని , పలు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజెప్పి , వారిని చెత్తన్య చేయాలన్నారు . అలాగే సమాజాన్ని పట్టి పీడిస్తూ , ప్రజల ఆర్థిక స్థితిని దిగజారుస్తున్న క్యాన్సర్ ప్రబలడానికి కారణాలు , నివారణా చర్యలపై కూడా ప్రజలకు అవగాహన కలుచేయాలని , కరోనా వ్యాక్సిన్లో ఉన్న అపోహలను తొలగించాలని ఫార్మశీ విద్యార్థులకు సలహా ఇచ్చారు .

నేడు విద్యార్థి సంఘంగా ప్రారంభమైన ఈ జీపీఎస్ఏ మంచి కార్యక్రమాలను చేపట్టి , త్వరలోనే ఓ విద్యార్థి క్లబ్ గా ఎదగాలని ఆయన ఆకాక్షించారు . లు వివిధ ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమ , ఆరోగ్య అంశాలపై చర్చలకు జీపీఎస్ఏ ఓ వేదికగా తోడ్పడుతుందని దాని వ్యవస్థాపకుడు , టాంజానియా దేశానికి చెందిన గీతం ఫార్మశీ విద్యార్థి శివం ఏ.పర్మర్ పేర్కొన్నారు . ఈ వేదికను నెలకొల్పడానికి గల కారణాలను , దాని నేపథ్యాన్ని శివం వివరించారు . కోవిడ్ వ్యాక్సిన్ప_అపోహలు – వాస్తవాలను ఫార్మశీ మూడు ఏడాది విద్యార్థిని ఆర్.నితీషా సిమ్రాన్ తెలియజేశారు . క్యాన్సర్ కారకాలు , నివారణ చర్యలపై ప్రతిభ ; యాంటీబయాటిక్స్ వినాయోగం – తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫార్మశీ తొలి ఏడాది విద్యార్థి విఘ్నేష్ , వీథుల వెంట నిరుపేదల జీవనంపై పైస్ట్రా తబస్సుమ్ు వివరించారు . డాక్టర్ సి.పవన్ కుమార్ , డాక్టర్ జితేంద్ర పాటిల్ జీఈపీఎస్ఏఏ ప్రాముఖ్యతను తెలియజేశారు . చివరగా డాక్టర్ రాకేష్ బారిక్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *