మనవార్తలు ,అమీన్పూర్:
భూస్వాములకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహోన్నత నాయకురాలు, స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సండే మార్కెట్ లో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పైన జాతీయ రహదారి పక్కన చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.