మనవార్తలు ,పటాన్ చెరు:
జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ నెల 18వ తేదీన పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగిలో నిర్వహించనున్న జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు టోర్నమెంట్ పోస్టర్ ను ఆదివారం తన నివాసం లో ఆవిష్కరించారు. ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి, మేరాజ్ ఖాన్, అమీన్ పూర్ మండల అధ్యక్షులు ఈర్ల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, రామకృష్ణ, అబెద్, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.