కరోనా నేపథ్యంలో జూపార్కులు మూసివేత….

Hyderabad

కరోనా నేపథ్యంలో జూపార్కులు మూసివేత….

– అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్:

కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని జూ పార్క్ లు, పులుల అభయారణ్యంలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి సూచనల మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్ శోభ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్క్ లను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ లు, రక్షిత అటవీ ప్రాంతాల మూసివేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. వీటిల్లో సందర్శకులకు అనుమతి నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *