గీతమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

politics Telangana

– పాల్గొన్న బ్రిటన్ , అమెరికా విశ్వవిద్యాలయాలు

– వివరాలు సేకరించిన విద్యార్థులు

మనవార్తలు ,పటాన్ చెరు:

హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరియర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఆధ్వర్యంలో ‘ యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్’ని నిర్వహించినట్టు జీసీజీసీ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . డెన్హమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ ( డీడబ్ల్యూసీ ) , గీతమ్ ని అదర్ కెరీర్ ఆప్షన్స్ ( ఓసీవో ) ల సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు . గీతం విద్యార్థులు , వారి తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సంభాషించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ , ఉపకార వేతనాలు , కోర్సులు , వసతి సౌకర్యం , ఇతర విలువ ఆధారిత ప్రయోజనాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు ఆయన వివరించారు . తొలుత , విదేశీ వర్సిటీల ప్రతినిధులు గీతం ఉన్నతాధికారులతో , ఆ తరువాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి , ఒకరిని మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు వేణుకుమార్ తెలిపారు . ఓసీవో డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ రవికాంత్ స్వాగతోపన్యాసం చేయగా , నరేష్ గుండోజు వందన సమర్పణతో ముఖాముఖి ముగిసిందన్నారు .

ఆ తరువాత ఫెయిర్ను గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించినట్టు తెలిపారు . యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా , సదరన్ కాలిఫోర్నియా , ఇల్లినాయిస్ ( చికాగో – స్ప్రింగ్ఫీల్డ్ ) డేటన్ , మసాచుసెట్స్ , డూండీ , స్ట్రాల్రెడ్ , యార్క్ నాటింగ్హామ్ వర్సిటీలతో పాటు న్యూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజెన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ పాల్గొన్నట్టు డాక్టర్ వేణుకుమార్ వివరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *